CEIR టెక్నాలజీతో సహాయంతో ఫోన్స్ స్వాధీనం
సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు
సిద్దిపేట,జనవరి 17:
పోగొట్టుకున్న ఫోన్ లను సి ఈ ఐ ఆర్ టెక్నాలజీ ద్వారా స్వాదినం చేసుకొని బాధితులకు అందజేయడం జరిగిందని సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ లింగంపల్లి వంశీ,గౌటే శివ, అజయ్ కుమార్, అనే వ్యక్తులు సిద్దిపేట పట్టణంలో నెల రోజుల క్రితం ఫోన్లు పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ లో వచ్చి దరఖాస్తు ఇచ్చారని ఫోన్ నెంబర్ ను, IMEI నంబర్ ను CEIR పోర్టల్ లో అప్లోడ్ చేయడం జరిగిందని. ఫోను దొరికిన అతని వద్ద నుండి చేసి సంబంధిత బాధితునికి అప్పగించడం జరిగిందన్నారు..
ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, లేదా గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని,ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని సూచించారు